అన్నదాతలకు అండగా సంక్షేమ పథకాలు : కలెక్టర్
ABN , First Publish Date - 2020-07-09T12:13:24+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతు సంక్షేమ పథకాలు అన్నదాతలకు కొండంత అండను కల్పిస్తోందని కలెక్టర్ సి.హరికిరణ్ తెలిపారు.
కడప(కలెక్టరేట్), జూలై 8: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతు సంక్షేమ పథకాలు అన్నదాతలకు కొండంత అండను కల్పిస్తోందని కలెక్టర్ సి.హరికిరణ్ తెలిపారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, వ్యవసాయ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్తో పాటు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధరెడ్డి, జేసీ గౌతమిలు పాల్గొన్నారు.
సీఎం వీసీ అనంతరం కలెక్టర్ హరికిరణ్ మాట్లాడుతూ అన్ని రైతు భరోసా కేంద్రాల్లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి జయంతిన రైతు దినోత్సవం రైతులు పండుగలా చేసుకోవడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో డీఆర్వో రఘునాధ్, వ్యవసాయ శాఖ ఇన్చార్జి జేడీ రాధాదేవి, ఉద్యానశాఖ డీడీలు వనజశ్రీ, మధుసూదనరెడ్డి, ఆత్మ పీడీ చంద్రానాయక్, లీడ్ బ్యాంకు మేనేజరు ఆంజనేయాచారి, డీసీసీ బ్యాంకు సీఈఓ రఘునాధ్ రెడ్డి, ప్రకృతి వ్యవసాయం పీడీ నాగరాజు, తదితర అధికారులు పాల్గొన్నారు.