1500 మెట్రిక్‌ టన్నుల కాఫీ గింజల సేకరణ లక్ష్యం

ABN , First Publish Date - 2021-10-29T05:06:05+05:30 IST

ఏజెన్సీలో 1500 మెట్రిక్‌ టన్నుల కాఫీ గింజల సేకరణ లక్ష్యమని గిరిజన సహకార సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌(ఎండీ) పీఏ శోభ తెలిపారు.

1500 మెట్రిక్‌ టన్నుల కాఫీ గింజల సేకరణ లక్ష్యం
సమావేశంలో మాట్లాడుతున్న జీసీసీ ఎండీ శోభ


జీసీసీ ఎండీ పీఏ శోభ

చింతపల్లి, అక్టోబరు 28: ఏజెన్సీలో 1500 మెట్రిక్‌ టన్నుల కాఫీ గింజల సేకరణ లక్ష్యమని గిరిజన సహకార సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌(ఎండీ) పీఏ శోభ తెలిపారు. గురువారం స్థానిక బ్రాంచి కార్యాలయంలో కొయ్యూరు, జీకేవీధి, చింతపల్లి మండలాల జీసీసీ అధికారులు, సేల్స్‌మన్‌, ఉమన్‌లతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఎండీ మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా జీసీసీ లాభాపేక్ష లేకుండా కాఫీ రైతులకు అంతర్జాతీయ ధరలను అందిస్తుందన్నారు. పాడేరు, చింతపల్లి డివిజన్ల పరిధిలో కాఫీ గింజలు జీసీసీ కొనుగోలు చేసి మార్కెటింగ్‌ చేస్తామన్నారు. దళారీల వల్ల గిరిజన రైతులు నష్టపోతున్నారని, ఈసమస్యను పూర్తిగా నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాఫీ గింజల ధరను అపెక్స్‌ కమిటీ సూచన మేరకు ప్రాథమికంగా నిర్ణయించడం జరిగిందని, ప్రభుత్వ అనుమతి వచ్చిన వెంటనే ప్రకటిస్తామన్నారు. వ్యవసాయ ఉత్పత్తులు కూడా కొనుగోలు చేసేందుకు  ప్రణాళిక సిద్ధం చేశామని జీసీసీ ఎండీ శోభ అన్నారు. గిరిజన రైతులు పండించిన రాగి(చోడి), రాజ్‌మా, పసుపు కొనుగోలు చేయాలని నిర్ణయించామన్నారు.  ఈకార్యక్రమంలో జీఎం చిన్నబాబు, డీఎం కె.పార్వతమ్మ, చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మేనేజర్ల బి.అప్పలరాజు, మురళీకృష్ణ, సరమండ విజయకుమార్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-29T05:06:05+05:30 IST