వ్యర్థ జలాల శాంపిళ్ల సేకరణ

ABN , First Publish Date - 2021-06-22T05:25:30+05:30 IST

మండలంలోని గుండ్లమాచునూర్‌, కాసాల గ్రామ శివారులోని పలు పరిశ్రమలను పీసీబీ అధికారులు సోమవారం సందర్శించారు.

వ్యర్థ జలాల శాంపిళ్ల సేకరణ

హత్నూర, జూన్‌ 21: మండలంలోని గుండ్లమాచునూర్‌, కాసాల గ్రామ శివారులోని పలు పరిశ్రమలను పీసీబీ అధికారులు సోమవారం సందర్శించారు. ఆ పరిశ్రమల సమీపంలో నిల్వ ఉన్న వ్యర్థ జలాల శాంపిళ్లను సేకరించారు. అనాలసిస్‌ రిపోర్టు ఆధారంగా పరిశ్రమలపై చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు. పరిశ్రమలను సందర్శించిన వారిలో పీసీబీ అనాలసిస్టు సురేష్‌, సిబ్బంది తదితరులు ఉన్నారు.


Updated Date - 2021-06-22T05:25:30+05:30 IST