వ్యర్థ జలాల శాంపిళ్ల సేకరణ
ABN , First Publish Date - 2021-06-22T05:25:30+05:30 IST
మండలంలోని గుండ్లమాచునూర్, కాసాల గ్రామ శివారులోని పలు పరిశ్రమలను పీసీబీ అధికారులు సోమవారం సందర్శించారు.
హత్నూర, జూన్ 21: మండలంలోని గుండ్లమాచునూర్, కాసాల గ్రామ శివారులోని పలు పరిశ్రమలను పీసీబీ అధికారులు సోమవారం సందర్శించారు. ఆ పరిశ్రమల సమీపంలో నిల్వ ఉన్న వ్యర్థ జలాల శాంపిళ్లను సేకరించారు. అనాలసిస్ రిపోర్టు ఆధారంగా పరిశ్రమలపై చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు. పరిశ్రమలను సందర్శించిన వారిలో పీసీబీ అనాలసిస్టు సురేష్, సిబ్బంది తదితరులు ఉన్నారు.