కోడ్ ముగిసినా ముసుగు తీయరా...?
ABN , First Publish Date - 2022-06-30T03:10:57+05:30 IST
జిల్లాలో ఎన్నికల్ కోడ్ ముగిసి మూడురోజులు కావస్తున్నా ఇంకా మండలంలో విగ్రహాలకు వేసిన ముసుగు తొలగించలేదు.
మనుబోలు, జూన్ 29: జిల్లాలో ఎన్నికల్ కోడ్ ముగిసి మూడురోజులు కావస్తున్నా ఇంకా మండలంలో విగ్రహాలకు వేసిన ముసుగు తొలగించలేదు. ఆత్మకూరు ఉప ఎన్నిక నేపథ్యంలో 25 రోజుల క్రితం ఎన్నికల కోడ్ విధించారు. దాంతో గ్రామాల్లో ఉన్న రాజకీయనాయకుల విగ్రహాలకు ముసుగు వేశారు. కోడ్ ముగిశాక ఆ ముసుగుతొలగించాల్సి ఉండగా, తీయకపోవడంతో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు.