derail: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు...నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు

ABN , First Publish Date - 2022-08-23T13:09:43+05:30 IST

ఓ గూడ్స్ రైలు పట్టాలు(goods train) తప్పిన ఘటన...

derail: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు...నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు

భువనేశ్వర్(ఒడిశా): ఓ గూడ్స్ రైలు పట్టాలు(goods train) తప్పిన ఘటన ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ రైల్వేస్టేషనులో(Bhubaneswar railway station) సోమవారం రాత్రి జరిగింది. సోమవారం రాత్రి 8.30 గంటలకు భువనేశ్వర్ రైల్వేస్టేషన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.(derailed) 5 గూడ్స్ బోగీలు పట్టాలు తప్పాయని రైల్వే డీఆర్ఎం రింకేష్ రాయ్ చెప్పారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో భువనేశ్వర్- కోల్ కతా మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయని(Traffic is affected) రైల్వే డీఆర్ఎం చెప్పారు.  



హౌరా-చెన్నై మార్గంలో( Howrah-Chennai route) రైళ్లు రాకపోకలు సాగించాయని రైల్వే అధికారులు చెప్పారు. ఈ గూడ్స్ ప్రమాదంలో ఎవరూ గాయపడక పోయినా, రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంగళవారం ఉదయం పట్టాలు తప్పిన గూడ్స్ బోగీలను తొలగించి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించామని రైల్వే డీఆర్ఎం రింకేష్ రాయ్ చెప్పారు.

Updated Date - 2022-08-23T13:09:43+05:30 IST