ప్రధాని మోదీకి సీఎం ఉద్ధవ్ ఫోన్
ABN , First Publish Date - 2021-04-17T18:32:46+05:30 IST
మహారాష్ట్రలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. దీంతో రోగులు ఆస్పత్రుల్లో ఎక్కువ సంఖ్యలో చేరుతున్నారు
ముంబై : మహారాష్ట్రలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. దీంతో రోగులు ఆస్పత్రుల్లో ఎక్కువ సంఖ్యలో చేరుతున్నారు. ఎక్కువ సంఖ్యలో చేరుతుండటంతో ఆక్సిజన్ అందక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రధాని మోదీకి శనివారం ఫోన్ చేశారు. ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకొని ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు కేంద్రం సహాయం అందించాలని పీఎం మోదీని కోరారు. తమకు 1200 నుంచి 1500 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరముందని ఉద్ధవ్ మోదీ దృష్టికి తీసుకొచ్చారు.