పేదల ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్‌ : నోముల

ABN , First Publish Date - 2020-08-09T06:44:46+05:30 IST

పేదలకు ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్‌ అని ఎమ్మెల్యే నోముల నర్సింహ య్య అన్నారు. త్రిపురారం మండలంలోని ..

పేదల ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్‌ : నోముల

త్రిపురారం / హాలియా / నిడమనూరు, ఆగస్టు 8 : పేదలకు ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్‌ అని ఎమ్మెల్యే నోముల నర్సింహ య్య అన్నారు. త్రిపురారం మండలంలోని మర్రిగూడెం గ్రామానికి చెందిన యలమశెట్టి నరే్‌షకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.20,500 చెక్కును అందించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ బాల్తి పద్మశ్రీనివాస్‌, గ్రామ అధ్యక్షుడు పెద్ద భి క్షమయ్య, సైదయ్య, వెంకన్న, జానకిరాములు పాల్గొన్నారు. అదేవిధంగా సాగర్‌ హిల్‌కాలనీకి చెందిన అబ్దుల్‌ మజీద్‌కు రూ. 12వేలు, త్రిపురారం మండలం మర్రిగూడెం గ్రామానికి చెందిన నరే్‌షకు రూ.20,500 చెక్కులు అందించారు. నిడమనూరు మం డల పరిధిలోని రేగులగడ్డ గ్రామంలో నిర్మించిన నూతన పం చాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్‌ విరిగినేని అంజయ్య, ఎంపీపీ బొల్లం జయమ్మ, జడ్పీటీసీ రామేశ్వరి, మార్కెట్‌ చైర్మన్‌ కామెర్ల జానయ్య పాల్గొన్నారు. విద్యార్థులకు ఆచరణాత్మక బోధన చేయాలి

Updated Date - 2020-08-09T06:44:46+05:30 IST