CM KCR క్రిస్మస్‌ విందు.. భారీ బందోబస్తు..

ABN , First Publish Date - 2021-12-21T13:22:53+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆతిథ్యమిస్తున్న క్రిస్మస్‌ డిన్నర్‌ నేపథ్యం లో

CM KCR క్రిస్మస్‌ విందు.. భారీ బందోబస్తు..
FILE PHOTO

  • నేడు సాయంత్రం ఎల్బీ స్టేడియం చుట్టూ ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌ సిటీ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆతిథ్యమిస్తున్న క్రిస్మస్‌ డిన్నర్‌ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. లాల్‌బహదూర్‌ స్టేడియాన్ని తమ అధీనంలోకి తీసుకున్న పోలీసులు భద్రతా చర్యల్లో నిమగ్నమయ్యారు. విందుకు సీఎంతో పాటు పలువురు మంత్రులు, ప్రముఖులు హాజరు కానున్నారు. ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా పరిసరాల్లో ఆంక్షలు విధించినట్లు అదనపు సీపీ విజయ్‌కుమార్‌ తెలిపారు. మంగళవారం సాయంత్రం 5 నుంచి రాత్రి 10 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు.



Updated Date - 2021-12-21T13:22:53+05:30 IST