విజయం సాధించాలి
ABN , First Publish Date - 2021-02-23T04:53:27+05:30 IST
మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ
- ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణి దేవి గెలుపు కోసం కలిసికట్టుగా కృషి చేయాలి
- ఉమ్మడి రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ నాయకులకు సీఎం సూచన
ఆమనగల్లు : మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కూతురు సురభివాణి దేవి విజయానికి కలిసి కట్టుగా కృషి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. సోమవారం ప్రగతి భవనంలో సురభివాణి దేవికి బీ-ఫామ్ అందజేసిన సందర్భంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు, జడ్పీచైర్పర్సన్, తదితర ప్రజాప్రతినిధులను ఆమెకు పరిచయం చేశారు.