నిబంధనలు పాటించని షాపులు మూసివేత
ABN , First Publish Date - 2020-06-30T11:27:07+05:30 IST
కొవిడ్ -19 నిబంధనలు పాటించకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్న దుకాణదారులపై కేసులు నమోదు చేసినట్లు నగర పాలక సంస్థ రెవెన్యూ
ఏలూరు ఫైర్స్టేషన్, జూన్ 29 : కొవిడ్ -19 నిబంధనలు పాటించకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్న దుకాణదారులపై కేసులు నమోదు చేసినట్లు నగర పాలక సంస్థ రెవెన్యూ అధికారి మురళీకృష్ణ తెలిపారు. సోమవారం టూటౌన్లో తనిఖీలు నిర్వహించి నిబంధనలు పాటించని నాలుగు దుకా ణాలను మూసి వేయించారు. వస్త్రదుకాణాలు రెండు, కిరాణా దుకాణం ఒకటి, ఎలక్ర్టికల్ షాపులు ఉన్నాయి. శాని టైజేషన్ చేయకుండా, మాస్క్లు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా అమ్మకాలు కొనసాగిస్తున్నారన్నారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్లు గాంధీ, రవిలు పాల్గొన్నారు.