పరిసరాల పరిశుభ్రతను పాటించాలి
ABN , First Publish Date - 2020-05-17T11:17:45+05:30 IST
డెంగ్యూ వ్యాధి కారకమైన దోమ నీటి నిల్వల్లో పెరిగే అవకాశం ఉన్నందున ప్రతి ఇక్కరూ పరిసరాల పరిశుభ్రత
కడప (కలెక్టరేట్), మే 16 : డెంగ్యూ వ్యాధి కారకమైన దోమ నీటి నిల్వల్లో పెరిగే అవకాశం ఉన్నందున ప్రతి ఇక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని డీఎంహెచ్వో డాక్టర్ ఉమా సుందరి తెలిపారు. డీఎంహెచ్వో కార్యాలయంలో శనివారం జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారిణి హుసేనమ్మ, ఖాజామోహిద్దీన్ పాల్గొన్నారు. డీఎంహెచ్వో మాట్లాడుతూ డెంగ్యూ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై నిరంతరం అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.