ఆయన్ను చూసి కాలేజీ విద్యార్థి అనుకున్నా... కిరణ్ రిజిజుపై జస్టిస్ ఎన్వీ రమణ సరదా వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2021-09-05T02:36:00+05:30 IST
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మధ్య సరదా సంభాషణ
న్యూఢిల్లీ : భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మధ్య సరదా సంభాషణ జరిగింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఓ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణను సత్కరించింది. ఈ కార్యక్రమానికి కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా హాజరయ్యారు. ఈ సమయంలోనే జస్టిస్ ఎన్వీ రమణ, కేంద్ర మంత్రి రిజిజుపై సరదా వ్యాఖ్యలు చేశారు. ‘‘నన్ను కలవడానికి కిరణ్ రిజిజు వచ్చారు. అప్పుడు ఆయన్ను చూసి కాలేజీ విద్యార్థి అని అనుకున్నా. అయితే ఆయన వయస్సు ఎంత అని నేను అడగడం లేదు. న్యాయశాస్త్రంలో పట్టా పొందానని, అయితే ప్రాక్టీస్ మాత్రం చేయలేదని కిరణ్ రిజిజు నాతో చెప్పారు’’ అని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు.