అవినీతిలో City Mla అగ్రగణ్యుడు
ABN , First Publish Date - 2022-04-20T17:42:21+05:30 IST
రాష్ట్రంలోని 224 మంది ఎమ్మెల్యేలలో రాయచూరు సిటీ ఎమ్మెల్యే డా.శివరాజ్ పాటీల్ అవినీతిలోఅగ్రగణ్యుడిగా నిలుస్తారని యూత్ కాంగ్రెస్ నాయకుడు రవి
- శివరాజ్ పాటిల్పై యూత్ కాంగ్రెస్ నాయకుడు రవి భోసరాజు ఆరోపణ
రాయచూరు(బెంగళూరు): రాష్ట్రంలోని 224 మంది ఎమ్మెల్యేలలో రాయచూరు సిటీ ఎమ్మెల్యే డా.శివరాజ్ పాటీల్ అవినీతిలోఅగ్రగణ్యుడిగా నిలుస్తారని యూత్ కాంగ్రెస్ నాయకుడు రవి భోసరాజు ఆరోపించారు. నిలకడలేని జిల్లాధికారుల వల్ల రాయచూరు జిల్లా అభివృద్దికి దూరంగా నిలిచిపోయే పరిస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం నగరంలోని ప్రెస్క్లబ్లో ఆ యన విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడా రు. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం 40 శాతం క మీషన్ ప్రభుత్వంగా ప్రసిద్ధి గాంచిందన్నారు. జిల్లాలో 40 శాతం కమీషన్ వసూలు కాలేదంటే వెంటనే సంబంధిత అధికారులను బదిలీ చేయించడం సిటీ ఎమ్మెల్యేకు పరిపాటిగా మారిందన్నారు. ఈ యన అవినీతి వల్లే జిల్లాలో ఏ ఒక్క జిల్లాధికారి నెలకడగా రెండేళ్లు పని చేయడం లేదని దీంతో అన్ని రకాల అభివృద్దికి ఆటంకం ఏర్పడిందన్నారు. కొత్తగా వచ్చిన జిల్లాధికారి జిల్లా స్థితిగతులపై అవగాహన పెంచుకుని అభివృద్ది కార్యక్రమాలు మొదలు పెట్టేలోగానే ఆయనను బదిలీ చేస్తుండడం వల్ల అభివృద్ది ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు తయారైందన్నారు. ఈ పరిస్థితి ఇదే రీతిలో కొనసాగితే తమ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.