సీఐటీయూ మహాసభలు జయప్రదం చేయాలి

ABN , First Publish Date - 2021-12-06T04:44:44+05:30 IST

తాడేపల్లిగూడెంలో సీఐటీయూ కౌన్సిల్‌ మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయూ నాయకులు డీఎస్‌వీడీ ప్రసాద్‌, బీర రవి అన్నారు.

సీఐటీయూ మహాసభలు జయప్రదం చేయాలి
గోడ పత్రికలను ఆవిష్కరించిన నాయకులు

కొవ్వూరు, డిసెంబరు 5: తాడేపల్లిగూడెంలో సీఐటీయూ కౌన్సిల్‌ మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయూ నాయకులు డీఎస్‌వీడీ ప్రసాద్‌, బీర రవి అన్నారు. ఆదివారం మహాసభల గోడపత్రికలను ఆవిష్కరించారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి బహుళ జాతి సంస్థలకు ఊడిగం చేసే కేంద్రప్రభుత్వ విధానాలపై ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఎం.సుందరబాబు, మైగాపూల నాగేశ్వరరావు, మద్దుకూరి దొరయ్య, వీరా త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-06T04:44:44+05:30 IST