కరోనాపై పోరుకు సినీ ప్రముఖుల విరాళాలు

ABN , First Publish Date - 2020-03-27T07:30:50+05:30 IST

కరోనాపై దేశం చేస్తున్న పోరులో మేము సైతం అంటూ సినీతారలు ముందుకొస్తున్నారు. భారీ విరాళాలతో పాటు వైద్య సదుపాయాల కల్పనకై ..

కరోనాపై పోరుకు సినీ ప్రముఖుల విరాళాలు

ముంబై, మార్చి 26: కరోనాపై దేశం చేస్తున్న పోరులో మేము సైతం అంటూ సినీతారలు ముందుకొస్తున్నారు. భారీ విరాళాలతో పాటు వైద్య సదుపాయాల కల్పనకై తమ వంతు సాయాన్ని అందిస్తున్నారు. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ముందుకొచ్చి రూ. 50లక్షలు ప్రకటించగానే.. దేశవ్యాప్తంగా అనేకమంది సినీ ప్రముఖులు ఆయన్ను అనుసరించారు. ముంబై కార్పొరేషన్‌లో పనిచేస్తున్న అందరికీ ఎన్‌95, ఎఫ్‌ఎ్‌ఫపీ3 మాస్కులు పంపిణీ చేయనున్నట్లు హృతిక్‌ రోషన్‌ ప్రకటించారు. మరోవైపు.. వ్యాఖ్యాత కపిల్‌ శర్మ రూ. 50లక్షల్ని ప్రధానమంత్రి సహాయనిధికి(పీఎంఆర్‌ఎఫ్‌) అందించనున్నట్లు తెలిపారు.   

Updated Date - 2020-03-27T07:30:50+05:30 IST