చురుకుగా టీడీపీ సభ్యత్వ నమోదు

ABN , First Publish Date - 2022-08-11T06:00:49+05:30 IST

చురుకుగా టీడీపీ సభ్యత్వ నమోదు

చురుకుగా టీడీపీ సభ్యత్వ నమోదు
ఉయ్యూరు 18వ వార్డులో పార్టీ సభ్యత్వం నమోదు చేస్తున్న నాయకులు

ఉయ్యూరు, ఆగస్టు 10 : పార్టీ సభ్యత్వ నమో దు చురుకుగా జరుగుతున్నట్టు టీడీపీ ఉయ్యూరు పట్టణ అధ్యక్షుడు జంపాన గుర్నాధరావు, నాయ కుడు పండ్రాజు చిరంజీవి తెలిపారు.  స్థానిక 18వ వార్డు లో బుధవారం సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పార్టీ సభ్యత్వం తీసుకునేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని, వైసీపీ అవినీతి, అరాచక పాలనతో ప్రజలు విసిగి  సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 10 వార్డుల్లో  సభ్యత్వ నమోదు దాదాపు పూర్తి చేసినట్టు తెలి పారు. పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు ప్రజలు ఉత్సాహంగా ఉన్నారని ఽధీమా వ్యక్తం చేశారు.  18వ వార్డు ఇన్‌చార్జి నజీర్‌,  పార్టీ నాయ కులు రఘుశర్మ, సలీమ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-11T06:00:49+05:30 IST