కుప్పంలో టీడీపీ నేతలపై అధికార పార్టీ కక్ష సాధింపు చర్యలు

ABN , First Publish Date - 2022-01-13T19:34:15+05:30 IST

కుప్పంలో టీడీపీ నేతలపై అధికారపార్టీ కక్ష సాధింపు చర్యలు పాల్పడుతోంది.

కుప్పంలో టీడీపీ నేతలపై అధికార పార్టీ కక్ష సాధింపు చర్యలు

చిత్తూరు: కుప్పంలో టీడీపీ నేతలపై అధికారపార్టీ కక్ష సాధింపు చర్యలు పాల్పడుతోంది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పి. గోపీనాథ్‌కు సంబంధించిన మెడికల్ షాప్‌ను అధికారులు మూసివేశారు. కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలలో 16వ వార్డు తెలుగుదేశం పార్టీ తరఫున గోపీనాథ్ కుమార్ కుమారుడు హర్ష కౌన్సిలర్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగారు. దీన్ని జీర్ణించుకోని అధికార పార్టీ నాయకులు ఒత్తిడి చేసి  మెడికల్ షాప్‌ను సీజ్ చేపించారని బాధితుడు ఆరోపించారు. మునిసిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ నాయకుల వద్ద డబ్బులు తీసుకున్నామని తమపై విష ప్రచారం చేయడమే కాకుండా తమను ఆర్థికంగా ఎలాగైనా దెబ్బతీయాలని  అధికార పార్టీ చూస్తోందని పి. గోపీనాథ్‌ తెలిపారు. 

Updated Date - 2022-01-13T19:34:15+05:30 IST