కానిస్టేబుల్ కారుకు నిప్పు పెట్టిన దుండగులు
ABN , First Publish Date - 2022-01-16T21:14:15+05:30 IST
చిత్తూరు జిల్లా: పీలేరులో ఓ కానిస్టేబుల్ కారుకు దుండగులు నిప్పు పెట్టారు.
చిత్తూరు జిల్లా: పీలేరులో ఓ కానిస్టేబుల్ కారుకు దుండగులు నిప్పు పెట్టారు. అయ్యప్ప రెడ్డి కాలనీలో ఉంటున్న ఆల్తాఫ్ కానిస్టేబుల్గా పని చేస్తున్నారు. అతని సిఫ్ట్ డిజైర్ కారుకు గుర్తు తెలియని దుండగులు నిప్పంటించడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధమైంది. దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.