మెడికల్ ఆఫీసర్పై నర్సు దాడి
ABN , First Publish Date - 2021-08-03T17:51:54+05:30 IST
పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికల్ ఆఫీసర్పై ఓ నర్సు దాడి చేసింది.
చిత్తూరు జిల్లా: పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికల్ ఆఫీసర్పై ఓ నర్సు దాడి చేసింది. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న నర్సు నాగలక్ష్మిని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చిరిమల ప్రశ్నించారు. దీంతో ఆగ్రహానికి లోనైన నర్సు డాక్టర్పై దాడికి పాల్పడింది. అక్కడున్న సిబ్బంది డాక్టర్ను కాపాడారు. నాగలక్ష్మి వల్ల తనకు ప్రాణహాని ఉందని డాక్టర్ భయపడుతున్నారు