Chittoor: ఏనుగుల దాడిలో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-05-25T14:49:53+05:30 IST

జిల్లాలోని పలమనేరు మండలం పెంగరగుంట పంచాయతీ ఇంధ్రానగర్‌లో ఏనుగులు బీభత్సం సృష్టించాయి.

Chittoor: ఏనుగుల దాడిలో వ్యక్తి మృతి

చిత్తూరు: జిల్లాలోని పలమనేరు మండలం పెంగరగుంట పంచాయతీ ఇంద్రానగర్ ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గ్రామసమీపాన పంట పొలాల వద్ద నివాసముంటున్న ఇంటిపై బుధవారం తెల్లవారుజామున ఏనుగుల గుంపు దాడికి పాల్పడింది. పొలము వద్ద నిద్రిస్తున్న యానాది సుబ్రమణి అనే రైతుపై ఏనుగుల దాడి చేశాయి.  తీవ్రంగా గాయపడిన సుబ్రమణి అక్కడికక్కడే మృతి చెందాడు. ఏనుగుల బీభత్సంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 

Updated Date - 2022-05-25T14:49:53+05:30 IST