47 ఏళ్ల వ్యక్తి.. ఏడేళ్ల చిన్నారికి మాయమాటలు చెప్పి.. ఇంట్లోకి తీసుకెళ్లి..

ABN , First Publish Date - 2020-10-01T18:23:32+05:30 IST

అభం శుభం తెలియని ఏడేళ్ల చిన్నారిపై 47 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి..

47 ఏళ్ల వ్యక్తి.. ఏడేళ్ల చిన్నారికి మాయమాటలు చెప్పి.. ఇంట్లోకి తీసుకెళ్లి..

చీరాల(ప్రకాశం): అభం శుభం తెలియని ఏడేళ్ల చిన్నారిపై 47 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి ఒడి గట్టాడు. కారంచేడు మండలం స్వర్ణలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. చీరాల ప్రభుత్వ వైద్యశాల అవుట్‌ పోస్ట్‌ పోలీసుల వివరాల ప్రకారం... స్వర్ణకు చెందిన దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. వీరు మంగళవారం పొలం పనులకు వెళ్లారు. ఇంటి వద్ద ఉన్న రెండో తరగతి చదువుతున్న చిన్నారిని అదేప్రాంతానికి చెందిన 47 ఏళ్ల వ్యక్తి మాయమాటలతో మభ్యపెట్టి తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బుధవారం కడుపు నొప్పి రావడంతో ఆ పాప తల్లడిల్లిపోయింది. ఆరా తీసిన తల్లి దండ్రులు విషయం తెలుసుకుని చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న ట్రైనీ డీఎస్పీ స్రవంతిరాయ్‌ కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.



Updated Date - 2020-10-01T18:23:32+05:30 IST