చిరునామా అడుగుతూ చైన స్నాచింగ్
ABN , First Publish Date - 2022-08-11T06:28:05+05:30 IST
చిరునామా అడుగుతూ మహిళ మెడలో నుంచి మూడు తులాల పుస్తెలతాడును దుండగులు అపహరించారు.
పెద్దఅడిశర్లపల్లి, ఆగస్టు10: చిరునామా అడుగుతూ మహిళ మెడలో నుంచి మూడు తులాల పుస్తెలతాడును దుండగులు అపహరించారు. ఈ సంఘటన మండలంలోని సింగరాశిపల్లిలో బుధవారం జరిగింది. గుడిపల్లి ఎస్ఐ వీరబాబు వివరాల ప్రకారం... పెద్దఅడిశర్లపల్లి మండలంలోని సింగరాశిపల్లికి చెందిన నాయిని వెంకట మ్మ భర్త వెంకటేశ్వరరెడ్డి తన భర్త బావి దగ్గరకు వెళ్లడంతో వెనుక నుంచి అన్నం తీ సుకుని వెళ్లుతుండగా ఊరి చివరిన ఎస్ఎల్బీసీ కెనాల్ వద్దకు వెళ్లింది. గుర్తుతెలియ ని వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చి ఘనపురం గ్రామానికి వెళ్లాలని చిరునామా అడి గాడు. ఆమె చెప్పే క్రమంలో వెంకటమ్మ మెడలో ఉన్న పుస్తెలతాడు లాక్కొని పారిపోయాడు. బాధితురాలు అరుస్తుండగా అక్కడే బర్రెలు మేపుతున్న పడాల వెంకయ్య తన చేతులో ఉన్న కర్రను బైక్పైకి విసిరాడు. దుండగుడు తప్పించుకుని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.