అక్కడ అంత్యక్రియలు, ఇక్కడ రాకెట్ మంటలు
ABN , First Publish Date - 2021-05-04T08:09:14+05:30 IST
కరోనా కారణంగా భారత్లో నెలకొన్న పరిస్థితిని చైనాలోని ఓ ప్రభుత్వ సంస్థ హేళన చేసింది. రోదసిలోకి తాము పంపిన టియాన్హీ మాడ్యూల్ ప్రయోగాన్ని...
- కొవిడ్ తీవ్రతను హేళన చేస్తూ చైనా ప్రభుత్వ సంస్థ పోస్టు
బీజింగ్, మే 3: కరోనా కారణంగా భారత్లో నెలకొన్న పరిస్థితిని చైనాలోని ఓ ప్రభుత్వ సంస్థ హేళన చేసింది. రోదసిలోకి తాము పంపిన టియాన్హీ మాడ్యూల్ ప్రయోగాన్ని, భారత్లో సామూహిక అంత్యక్రియల్ని పోలుస్తూ.. అధికార కమ్యూనిస్టు పార్టీకి చెందిన రాజకీయ, న్యాయ వ్యవహారాల కమిషన్ తమ వీబో ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. చైనాలో మంట వెలిగించడానికి, భారత్లో మంట వెలిగించడానికి మధ్య తేడా అంటూ దానికి వ్యాఖ్యను జత చేసింది. ప్రపంచవ్యాప్తంగానూ విమర్శలు వ్యక్తం కావడంతో పోస్ట్ చేసిన గంటల వ్యవధిలోనే దాన్ని తొలగించింది.