పంద్రాగస్టుకు పిల్లలు దూరం
ABN , First Publish Date - 2020-08-12T07:49:27+05:30 IST
ఈసారి పంద్రాగస్టు వేడుకలు అనేక పరిమితులు, ఆంక్షల నడుమ జరగనున్నాయి. కరోనా ప్రబలిన నేపథ్యంలో కేంద్రం అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. శనివారం ప్రధాని మోదీ ఎర్రకోటకు ఉదయం గం.7.21కు చేరుకుంటారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి...
- ‘నెగెటివ్’ అని తేలిన సైనికులు, సిబ్బందితోనే విన్యాసాలు
న్యూఢిల్లీ, ఆగస్టు 11 : ఈసారి పంద్రాగస్టు వేడుకలు అనేక పరిమితులు, ఆంక్షల నడుమ జరగనున్నాయి. కరోనా ప్రబలిన నేపథ్యంలో కేంద్రం అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. శనివారం ప్రధాని మోదీ ఎర్రకోటకు ఉదయం గం.7.21కు చేరుకుంటారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. 7.30కి త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన అనంతరం 45-90 నిమిషాల పాటు ప్రసంగిస్తారు. సైనిక విన్యాసాల్లో పాల్గొనే సిబ్బంది విషయంలో ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగెటివ్ అని తేలిన వారిని మాత్రమే ఆ విన్యాసాల్లో పాల్గొంటారు. అలాగే వైరస్ బారిన పడి కోలుకున్న జవాన్లను సైతం అనుమతిస్తారు.
ఈ వేడుకల్లో పాల్గొనే 350 మంది పోలీసులను ముందస్తు క్వారంటైన్ నిమిత్తం ఢిల్లీ కంటోన్మెంట్లోని ఓ హౌసింగ్ కాలనీకి ఇప్పటికే తరలించారు. అలాగే ఈ వేడుకల్లో పాల్గొనే సైనికులు, సిబ్బంది కదలికలపై ఆంక్షలు విధించారు. రిహార్సల్స్కు మినహాయించి ఇళ్ల వద్ద నుంచి కదలొద్దని ఆదేశించారు. వారి సహాయకులు, వంటవాళ్లు, డ్రైవర్లను సైతం ముందు జాగ్రత్తగా క్వారంటైన్లో ఉంచారని ఆ వర్గాలు తెలిపాయి. ఈసారి పంద్రాగస్తు వేడుకల్లో స్కూల్ పిల్లలను దూరంగా ఉంచుతున్నారు. ఏటా 3500 మంది విద్యార్థులు పాల్గొనేవారు. కానీ ఈ సారి కరోనా భయంతో వారిని అనుమతించడం లేదు. ఇక అతిథుల సంఖ్యనూ భారీగా తగ్గించేశారు.