ఇద్దరు చిన్నారుల అదృశ్యం

ABN , First Publish Date - 2021-01-27T06:31:19+05:30 IST

తోటిపిల్లలతో ఆడుకుంటూ ఇద్దరు చిన్నారులు అదృశ్యమయ్యారు. దీనిపై మారేడుమిల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. మండలంలోని మారేడుమిల్లి పంచాయతీ మూసూరు గ్రామానికి చెం దిన మూడేళ్ల మట్ల హర్షిణి, రెండున్నరేళ్ల ఆర్యాకుల శ్రీవైష్ణవి ఈనెల 22వ తేదీ మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయారు.

ఇద్దరు చిన్నారుల అదృశ్యం

మారేడుమిల్లి, జనవరి 26: తోటిపిల్లలతో ఆడుకుంటూ ఇద్దరు చిన్నారులు అదృశ్యమయ్యారు. దీనిపై మారేడుమిల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. మండలంలోని మారేడుమిల్లి పంచాయతీ మూసూరు గ్రామానికి చెం దిన మూడేళ్ల  మట్ల హర్షిణి, రెండున్నరేళ్ల ఆర్యాకుల శ్రీవైష్ణవి ఈనెల 22వ తేదీ మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయారు. తోటి పిల్లలతో గ్రామంలోని వాటర్‌ ట్యాంక్‌ వద్ద ఆడుకున్నట్లు సమాచారం అందుకున్న తల్లిదంద్రులు, గ్రామస్థులు పిల్లల కోసం వెతికినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై మారేడుమిల్లి ఎస్‌ఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 



Updated Date - 2021-01-27T06:31:19+05:30 IST