పింఛన్‌ సొమ్ము నొక్కేసిన వలంటీర్‌

ABN , First Publish Date - 2020-07-08T21:49:16+05:30 IST

పింఛన్‌ సొమ్మును వలంటీర్‌ నొక్కేసిన ఘటన మండలంలోని..

పింఛన్‌ సొమ్ము నొక్కేసిన వలంటీర్‌

బీచెర్లోపల్లిలో ఘటన..

ఎంపీడీవోకు వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ ఫిర్యాదు 


పెద్దారవీడు(ప్రకాశం): పింఛన్‌ సొమ్మును వలంటీర్‌ నొక్కేసిన ఘటన మండలంలోని బీ చెర్లోపల్లిలో జరిగింది. గ్రామానికి చెంది వలంటీర్‌ తుమ్మల లక్ష్మీరెడ్డి ఈ నెల 1న వివిధ రకాల పింఛన్‌లను లబ్ధిదారులకు పంపిణీ చేశాడు. మిగిలి ఉన్న నగదును అధికారులకు జమ చేయాల్సి ఉంది. అలా ఉన్న రూ.4500 ఇవ్వకుండా లక్ష్మీరెడ్డి తన సొంతానికి వాడుకున్నాడు. దీనిపై వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ శ్రీనివాస్ రెడ్డి ఎంపీడీవో జైరాం నాయక్‌కు ఫిర్యాదు చేశారు. లక్ష్మీరెడ్డి విధులకు కూడా సక్రమంగా హాజరు కావడంలేదని గ్రామ సచివాలయ సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఎంపీడీవో జైరాంనాయక్‌ వివరణిస్తూ వలంటీర్‌ లక్ష్మీరెడ్డిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

Updated Date - 2020-07-08T21:49:16+05:30 IST