ప్రభుత్వ మద్యం విక్రయాలు నిలిపివేయాలని నిరసన
ABN , First Publish Date - 2020-05-11T11:38:56+05:30 IST
ప్రభుత్వ మద్యం విక్రయాలు నిలిపివేయాలని ఏపీ మహిళా సమాఖ్య ఆర్గనైజింగ్ కార్యదర్శి చెన్నూరు క్రిష్ణవేణి ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు.
రైల్వేకోడూరు రూరల్, మే, 10: ప్రభుత్వ మద్యం విక్రయాలు నిలిపివేయాలని ఏపీ మహిళా సమాఖ్య ఆర్గనైజింగ్ కార్యదర్శి చెన్నూరు క్రిష్ణవేణి ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్య నిషేదాన్ని అమలు చేయాలని డిమాండు చేశారు. అనంతరం రైల్వేకోడూరు ఎక్సైజ్శాఖ సీఐ చంద్రశేఖర్కు వినతిపత్రం సమర్పించారు.నాయకురాళ్లు నరసమ్మ, చిన్నక్క, వెంకటసుబ్బమ్మ, పెంచలమ్మ, రామాంజనేయమ్మ, గంగా, వరలక్ష్మీ పాల్గొన్నారు.