Chess Chennai: చెన్నైకి చెస్ ఫీవర్
ABN , First Publish Date - 2022-07-31T13:56:53+05:30 IST
చెన్నై(Chennai)కి చెస్ ఫీవర్ పట్టుకుంది. దేశ చరిత్రలోనే తొలిసారిగా చెస్ ఒలంపియాడ్(Chess Olympiad) పోటీలు రాష్ట్రం లో జరుగుతున్న విషయం
చెన్నై, జూలై 30 (ఆంధ్రజ్యోతి): చెన్నై(Chennai)కి చెస్ ఫీవర్ పట్టుకుంది. దేశ చరిత్రలోనే తొలిసారిగా చెస్ ఒలంపియాడ్(Chess Olympiad) పోటీలు రాష్ట్రం లో జరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర రాజధాని ప్రాంతానికి అతి చేరువలో వున్న మహాబలిపురంలో ఈ 44వ చెస్ ఒలంపియాడ్ పోటీలు జరుగుతుండడంతో చెన్నైలో ఎక్కడ చూసి నా దీనిపైనే చర్చ జరుగుతోంది. రాష్ట్రానికి గర్వకారణంగా భావిస్తున్న ఈ పోటీల పట్ల యావత్ ప్రజానీకం ఎనలేని ఆసక్తి కనబరుస్తున్నారు. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా వీధివీధినా ప్రచారం చేపట్టడంతో ప్రజల్లోనూ అవగాహన పెరిగింది. దీంతో చెస్ పట్ల మరింత ఆసక్తి కలిగేలా ఊరూవాడా ఎవరికి తోచిన విధంగా వారు ప్రచారం(campaign) చేస్తున్నారు. ఇప్పటికే చెస్బోర్డు నమూనాలో నేపియర్ బ్రిడ్జి అందరినీ ఆకర్షిస్తుండగా, రోడ్ల పక్కన, ప్రధాన కూడళ్లలో ‘మస్కట్ తంబి’(Muscat Tambi) అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అన్నానగర్లోని ఓ టీ దుకాణం కూడా చెస్బోర్డు నమూనాతో రంగులద్దుకుని అందరినీ ఆకర్షిస్తోంది.