వినియోగదారులకు ఉత్తమ సేవల కోసం ఎయిర్టెల్ మరో ముందడుగు
ABN , First Publish Date - 2021-05-26T13:30:45+05:30 IST
రాష్ట్రంలోని తన వినియోగదారులకు ఉత్తమ సేవలు అందించేందుకు ఎయిర్టెల్ సంస్థ మరో ముందడుగు వేసింది. తమ వినియోగదారులకు ఉత్తమ నెట్వర్క్ను
చెన్నై: రాష్ట్రంలోని తన వినియోగదారులకు ఉత్తమ సేవలు అందించేందుకు ఎయిర్టెల్ సంస్థ మరో ముందడుగు వేసింది. తమ వినియోగదారులకు ఉత్తమ నెట్వర్క్ను అందించేం దుకు మరింత అప్గ్రేడ్ చేసింది. ఈ మేరకు నిర్వాహకులు ప్రకటన విడుదల చేశారు. హైస్పీడ్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచేందుకు ఎయిర్టెల్ 1800 ఎంహెచ్జడ్ బ్యాండ్లో అదనంగా 5ఎంహెచ్ జడ్ స్పెక్ట్రంను రాష్ట్రంలోని తన నెట్వర్క్ అంతటా ముందస్తు నెట్వర్క్ సాఫ్ట్వేర్ సాధనాలతో మోహ రించింది. ఈ విస్తరణ రాష్ట్ర వ్యాప్తంగా ఎయిర్టెల్ కస్టమర్ల కోసం ఇప్పటికే ఉన్నతమైన నెట్వర్క్ను బలోపేతం చేస్తుంది. నగరాలు, పట్టణ ప్రాంతాల్లోని ఇళ్లు, భవనాల లోపల మెరుగైన కవరేజ్తో పాటు మెరుగైన్ నెట్వర్క్ లభ్యత మరియు డేటా వేగాన్ని ఇది అనుమతిస్తుంది. ఈ విస్తరణ ఎయిర్టెల్కు హైవేలు మరియు రైలు మార్గాల్లో విస్త్రత కవరేజీని అందించడానికి వీలు కల్పిస్తుంది.