ఎవరో చెప్పిన మాట విని ప్రాణాలు తీసుకున్నారు..

ABN , First Publish Date - 2020-04-05T14:23:10+05:30 IST

ఎవరో చెప్పిన మాట విని ప్రాణాలు తీసుకున్నారు..

ఎవరో చెప్పిన మాట విని ప్రాణాలు తీసుకున్నారు..

చెన్నై: కూల్‌డ్రింక్‌లో షేవింగ్‌క్రీమ్‌ కలిపి తాగిన కోట్టైపట్టణం వాసులు ఇద్దరు  మృతి చెందారు. లాక్‌డౌన్‌తో రాష్ట్రంలో టాస్మాక్‌ దుకాణాలు కూడా మూతపడ్డాయి. దీంతో మందుబాబులు తీవ్ర ఒత్తిడికి గురై మద్యం కోసం అలమటిస్తున్నారు. పుదుకోట జిల్లా కోట్టైపట్టణానికి చెందిన అన్వర్‌ రాజా, స్నేహితులు అరుణ్‌పాండి, అజాన్‌ మైదీన్‌తో కలసి తరచూ టాస్మాక్‌కు వెళ్లి మద్యం తాగేవారు. ప్రస్తుతం దుకాణాలు మూతపడడంతో వారిపై ఒత్తిడి పెరిగింది. ఇదిలా ఉండగా, సోడాలో షేవింగ్‌ క్రీమ్‌ కలుపుకుని తాగితే మత్తు ఎక్కుతుందని కొందరు తెలపడంతో నమ్మినవారు అలా కలిపి తాగారు. తాగిన కొద్దిక్షణంలోనే స్పృహ తప్పిన ఆ ముగ్గురిని స్థానికులు పళమేడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే మార్గ మధ్యంలోనే అరుణ్‌పాండి, అజాన్‌మైదీన్‌ మృతిచెందారు. అన్వర్‌రాజాకు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Updated Date - 2020-04-05T14:23:10+05:30 IST