డాగ్ స్క్వాడ్తో గంజాయి స్థావరాలపై తనిఖీలు
ABN , First Publish Date - 2021-10-20T04:05:48+05:30 IST
అనుమానం ఉన్న గంజాయి స్థావరాల్లో డాగ్ స్క్వాడ్తో తనిఖీలు నిర్వహించారు. సీపీ విష్ణు ఎస్.వారియర్ ఆదేశాల మేరకు చేయడంతో త్రీటౌన్ ఏస్ఐ శ్రావణ్ ఆధ్వర్యంలో మంగళవారం తనిఖీలు నిర్వహించారు.
ఖమ్మం క్రైం, అక్టోబరు19: అనుమానం ఉన్న గంజాయి స్థావరాల్లో డాగ్ స్క్వాడ్తో తనిఖీలు నిర్వహించారు. సీపీ విష్ణు ఎస్.వారియర్ ఆదేశాల మేరకు చేయడంతో త్రీటౌన్ ఏస్ఐ శ్రావణ్ ఆధ్వర్యంలో మంగళవారం తనిఖీలు నిర్వహించారు. త్రీటౌన్ ప్రాంతంలో గతంలో గంజాయి సేవిస్తు, గంజాయి అమ్ముతూ పట్టుబడిన ప్రదేశాలలో, ఖాళీ స్థలాల్లో డాగ్స్క్వాడ్తో ఈ తనిఖీలు నిర్వహించినట్టు సీఐ సర్వయ్య తెలిపారు. గంజాయి అమ్ముతున్నా, సేవిస్తు న్నట్టు తెలిసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.