ఇసుక రీచ్‌ తనిఖీ

ABN , First Publish Date - 2022-05-25T05:00:08+05:30 IST

పెన్నానదీ పరివాహక ప్రాంతాలు అంబవరం, కన్నెలూరు మధ్య ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌ను ఎర్రగుం ట్ల మైనింగ్‌ అధికారులు తనిఖీచేశారు.

ఇసుక రీచ్‌ తనిఖీ
ఇసుక రీచ్‌ను పరిశీలిస్తున్న మైనింగ్‌ అధికారులు

జమ్మలమడుగు రూరల్‌, మే 24: పెన్నానదీ పరివాహక ప్రాంతాలు అంబవరం, కన్నెలూరు మధ్య ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌ను ఎర్రగుం ట్ల మైనింగ్‌ అధికారులు తనిఖీచేశారు. మంగళవారం మధ్యాహ్నం రెం డు గంటలకు ఇసుక రీచ్‌ను తనిఖీ చేసినట్లుగా స్థానిక అధికారుల ద్వారా తెలుస్తోంది. మైనింగ్‌ ఏడీ రాజే్‌షకుమార్‌, ఇన్‌స్పెక్టర్‌ ఝాన్సీ, ఆర్‌ఐ సురేంద్రతో కలిసి జమ్మలమడుగు తహసీల్దారు మధుసూదన్‌రెడ్డి, సిబ్బంది ఇసుక రీచ్‌కు వెళ్లారు. అధికారులు ఇసుక రీచ్‌ను తనిఖీ చేసి కొలతలు వేశారు. టీడీపీ ఎమ్మెల్సీ దేవగుడి శివనాథరెడ్డి ఇసుక రీచ్‌ తనిఖీ విషయమై చేసిన ఫిర్యాదుపై స్పందించిన అధికారులు ఇసుక రీచ్‌కు వెళ్లి కొలతలు వేశారు. కలెక్టర్‌ నివేదిస్తామని తెలిపారు. 

Updated Date - 2022-05-25T05:00:08+05:30 IST