Charminar భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిట
ABN , First Publish Date - 2021-11-04T14:38:08+05:30 IST
దీపావళి పండుగ సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది.
హైదరాబాద్: దీపావళి పండుగ సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆలయంలో ఉదయం నుండి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అద్భుతమైన అలంకరణతో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుండి భక్తులు విచ్చేస్తున్నారు. తెల్లవారుజాము నుండే భక్తులు లైన్లో వేచి ఉన్నారు. మాస్క్ ధరిస్తున్న వారినే ఆలయ కమిటీ సభ్యులు లోపలికి అనుమతిస్తున్నారు. ఉదయం బీజేపీ లక్ష్మణ్ అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే మరికాసేపట్లో తెలంగాణ గవర్నర్ తమిళిసై అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఈ క్రమంలో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం చుట్టూ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.