ఓటీఎస్ పేరుతో వసూళ్లు సరికాదు
ABN , First Publish Date - 2021-12-04T05:28:11+05:30 IST
ఓటీఎస్ పేరుతో ప్రభుత్వం పేదల నుంచి వసూళ్లకు పాల్పడడడం సరికాదని డీసీసీ అధ్యక్షురాలు బొడ్డేపల్లి సత్యవతి అన్నారు.
శ్రీకాకుళం, (ఆంధ్రజ్యోతి): ఓటీఎస్ పేరుతో ప్రభుత్వం పేదల నుంచి వసూళ్లకు పాల్పడడడం సరికాదని డీసీసీ అధ్యక్షురాలు బొడ్డేపల్లి సత్యవతి అన్నారు. శుక్రవారం ఆమె జిల్లా కాంగ్రెస్ భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎప్పుడో కట్టుకున్న ఇళ్లకు ఇప్పుడు గృహహక్కు కల్పించడం ఏంటని ప్రశ్నించారు. ఇటీవల ఎల్ఐసీ వద్ద ఉన్న రూ.2 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం దారుణమన్నారు. పంచాయతీలకు చెందిన 14, 15వ ఆర్థిక సంఘం నిధులను దారిమళ్లించి వాడుకోవడం ఎంతవరకు సమంజసమన్నారు. రానున్న రోజుల్లో ప్రజాఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. సమావేశంలో నాయకులు అన్నాజీరావు, డి.గోవిందమల్లిబాబు, బస్వాషణ్ముఖరావు, రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
11111111111111111111111111