కాంగ్రెస్ చీఫ్‌తో తనకు ఎలాంటి గొడవ లేదు: సీఎం

ABN , First Publish Date - 2022-01-28T01:11:12+05:30 IST

కాంగ్రెస్ చీఫ్‌తో తనకు ఎలాంటి గొడవ లేదు: సీఎం

కాంగ్రెస్ చీఫ్‌తో తనకు ఎలాంటి గొడవ లేదు: సీఎం

న్యూఢిల్లీ: సీఎం అభ్యర్థిపై పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ, సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ మధ్య గొడవలు జరుగుతున్నాయన్న వార్తల మధ్య చన్నీ గురువారం మాట్లాడుతూ "తమ మధ్య ఎలాంటి గొడవ లేదు" అని అన్నారు.  కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరైన ఓ కార్యక్రమంలో సిద్ధూను కౌగిలించుకుంటూ ఆయన ఈ ప్రకటన చేశారు."పంజాబ్ ఎన్నికలకు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలని కోరారు. తాము (పంజాబ్ కాంగ్రెస్) ఐక్యంగా నిలబడతామని చన్నీ తెలిపారు. 2022 పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థిని ప్రకటిస్తుందని రాహుల్‌ గాంధీ గురువారం చెప్పారు.

Updated Date - 2022-01-28T01:11:12+05:30 IST