పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో మార్పులు
ABN , First Publish Date - 2020-06-05T10:04:59+05:30 IST
ఈనెల 8 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో స్వల్ప మార్పులు చేసినట్లు ఎంఈవో శంకర్రాథోడ్ తెలిపారు.
షాద్నగర్: ఈనెల 8 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో స్వల్ప మార్పులు చేసినట్లు ఎంఈవో శంకర్రాథోడ్ తెలిపారు. ఫరూఖ్నగర్లోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని ఠాగూర్ ఉన్నత పాఠశాలకు మార్చామని తెలపారు. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల సెంటర్ను ఓంకార్ పాఠశాలకు, జడ్పీహెచ్ఎస్ కుంట పాఠశాల సెంటర్ను కాకతీయ పాఠశాలకు, భాష్యం పాఠశాల సెంటర్ను భాష్యం ప్రాథమిక పాఠశాలకు, ఫరూఖ్నగర్ మండలంలోని మొగిలిగిద్ద ఉన్నత పాఠశాల సెంటర్ను అక్కడే గల పాత భవనంలోకి మార్చామని ఆయన తెలిపారు. మిగతా సెంటర్లలో ఎలాంటి మార్పు లేదన్నారు. పరీక్షా కేంద్రాల వివరాలను విద్యార్థులకు వెంటనే ఉపాధ్యాయులు తెలియజేసి వారిని ఒక గంట ముందు పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా చూడాలని ఎంఈవో తెలిపారు.