ముగిసిన చంద్రబాబు కుప్పం పర్యటన
ABN , First Publish Date - 2021-02-28T06:43:54+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన శనివారంతో ముగిసింది.
కుప్పం, ఫిబ్రవరి 27: టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన శనివారంతో ముగిసింది. కుప్పంలోని నాలుగు మండలాల్లో గురు, శుక్ర వారాల్లో విస్తృతంగా పర్యటించి బహిరంగ సభలు, కార్యకర్తల సమావేశాల్లో చంద్రబాబు పాల్గొన్న విషయం తెలిసిందే. శనివారం ఉదయం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్లో ప్రజలనుంచి ఆయన వినతులు స్వీకరించారు. అనంతరం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో కుప్పం నుంచి బయలుదేరిర బెంగళూరు ఎయిర్పోర్టు చేరుకున్నారు. అక్కడినుంచి విమానంలో హైదరాబాదు వెళ్లారు.