నామమాత్రంగా చంద్రబాబుకు కాన్వాయ్..!
ABN , First Publish Date - 2021-07-13T12:32:05+05:30 IST
జడ్ ప్లస్ భద్రత కలిగిన చంద్రబాబు పర్యటన సందర్భంగా..
తిరుపతి : శాప్ మాజీ ఛైర్మన్ పీఆర్ మోహన్కు నివాళులర్పించేందుకు వచ్చిన టీడీపీ అధినేత చంద్ర బాబుకు సోమవారం మధ్యాహ్నం తిరుపతి విమా నాశ్రయంలో సాదర స్వాగతం లభించింది. తిరుపతి పార్లమెంటరీ పార్టీ కమిటీ అధ్యక్షుడు నరసింహ యాదవ్, సభ్యులతో పాటు కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా శ్రీకాళహస్తికి చేరుకున్న చంద్రబాబు దాదాపు గంట పాటు పీఆర్ మోహన్ నివాసం వద్ద గడిపారు. పీఆర్ మోహన్ కుటుంబ సభ్యులను పరామర్శించాక 3.15 గంటలకు విమానాశ్రయానికి ప్రయాణమయ్యారు. చంద్రబాబుతో పాటు టీడీపీ నాయకులు అమరనాథరెడ్డి, పట్టాభి, పులివర్తి నాని, గాలి భాను ప్రకాష్, బొజ్జల సుధీర్ రెడ్డి,శ్రీధర్ వర్మ, రవినాయుడు తదితరులు ఆయన వెంట వున్నారు.
ఎందుకిలా..!?
జడ్ ప్లస్ భద్రత కలిగిన చంద్రబాబు పర్యటన సందర్భంగా స్థానిక అధికారులు ఏర్పాటు చేసిన కాన్వాయ్ విస్మయానికి గురిచేసింది. కాన్వాయ్లో ఉండే పోలీసు వాహనాలకు, చంద్రబాబు వెళ్లే వాహనానికి సంబంధం లేకుండా పర్యటన సాగింది. రెండు, మూడు చోట్ల కాన్వాయ్కు ఎదురుగా పెద్దపెద్ద లారీలను కూడా వదిలేశారు. అదేవిధంగా కాన్వాయ్కి చెందిన 10వ నెంబరు వాహనంగా చిన్న కారును ఏర్పాటుచేయడం, అది కాన్వాయ్కు సంబంధంలేకుండా ప్రయాణించడం కనిపించింది. ఇక తిరుగు ప్రయాణంలో రోప్ పార్టీ ఉండే పోలీస్ వ్యాను చంద్రబాబు విమానాశ్రయం చేరుకున్న పదినిమిషాల తర్వాత రావడం గమనార్హం.