Chandanagarలో వేలానికి ప్రభుత్వ భూమి
ABN , First Publish Date - 2022-01-28T16:28:34+05:30 IST
చందానగర్ పరిధిలోని సర్వేనెంబర్ 65, 66లోని 2.27 ఎకరాల ప్రభుత్వ భూమిని వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది
హైదరాబాద్/చందానగర్: చందానగర్ పరిధిలోని సర్వేనెంబర్ 65, 66లోని 2.27 ఎకరాల ప్రభుత్వ భూమిని వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం ఆ స్థలాన్ని రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతీక్జైన్, ఆర్డీవో చంద్రకళ, టీఎ్సఐఐసీ జోనల్ కమిషనర్ అనురాధ పరిశీలించారు. భూమిని చదును చేయాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో రాజీవ్స్వగృహ ఈఈ నందకుమార్, శేరిలింగంపల్లి తహసీల్దార్ వంశీమోహన్, సిబ్బంది ఉన్నారు.