చలసాని శ్రీనివాస్కు మాతృ వియోగం
ABN , First Publish Date - 2020-08-13T14:09:47+05:30 IST
తెలుగుజాతి ఉద్యమ నేత, రచయిత చలసాని శ్రీనివాస్ మాతృమూర్తి..
పాలకొల్లు(పశ్చిమ గోదావరి): తెలుగుజాతి ఉద్యమ నేత, రచయిత చలసాని శ్రీనివాస్ మాతృమూర్తి డాక్టర్ జిజియా చౌదరి (88) హైదరాబాద్లో గుండెపోటుతో మృతి చెందారు. డాక్టర్ జిజియా డెల్టా ప్రాంతంలో మొదటి మహిళా వైద్యురాలు. పాలకొల్లులో సంవత్సరానికి ఒక్క రూపాయి ఫీజుతో అందరికీ వైద్యం చేసేవా రు. రెండు నెలల క్రితం (వైద్యం మానివేసే నాటికి) రూ.5 మాత్ర మే ఫీజు తీసుకునేవారు. మద్రాసులో వైద్య విద్యనభ్యసించిన జిజి యా చౌదరికి సంగీతంలో ప్రావీణ్యం ఉంది. చిత్రకారిణి. అనేక పత్రికలలో ఆమె కవితలు, రచనలు ప్రచురితమయ్యాయి.
స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామమోహన్, నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు, మాజీ ఎంపీ చేగొండి వెంకట హరిరామజోగయ్య, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు సీహెచ్ సత్యనారాయణమూర్తి, బంగారు ఉషారాణి, పితాని సత్యనా రాయణ, క్షీరపురి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కమిటీ చైర్మన్ ముత్యాల శ్రీనివాస్, ఏఎంసీ మాజీ చైర్మన్ ఉన్నమట్ల కబర్ధి తదితరులు చలసాని శ్రీనివాస్ను ఫోన్లో పరామర్శించారు.