761మందికి ప్రశంసాపత్రాలు
ABN , First Publish Date - 2021-01-27T06:27:02+05:30 IST
జిల్లావ్యాప్తంగా వివిధ శాఖల్లో అత్యుత్తమ సేవలందించిన 761 మంది అధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు కలెక్టర్ భరత్గుప్తా ప్రశంసాపత్రాలను అందించారు.
కొవిడ్ వారియర్స్కు షీల్డుల బహూకరణ
చిత్తూరు కలెక్టరేట్, జనవరి 26: జిల్లావ్యాప్తంగా వివిధ శాఖల్లో అత్యుత్తమ సేవలందించిన 761 మంది అధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు కలెక్టర్ భరత్గుప్తా ప్రశంసాపత్రాలను అందించారు. అలాగే కరోనా నివారణకు కృషి చేసిన వైద్యాధికారులకు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, అర్బన్ హెల్త్ సెంటర్లు, పీహెచ్సీలు, ఫైర్స్టేషన్, 108, 104 తదితర బృందాలకు వేర్వేరుగా షీల్డులను బహూకరించారు. కాగా.. కొవిడ్ ఆంక్షలు ఉండటంతో వేదిక వద్దకు అవార్డు గ్రహీతలు తొలుత గుంపులుగా రావడంతో కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. డీఎంహెచ్వో పెంచలయ్యను పిలిచి.. వరుస క్రమం పాటించేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోలేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ప్రశంసాపత్రాల పంపిణీని ఆపేశారు. అందరూ వరుస క్రమం పాటించాక 15 నిమిషాల తర్వాత తిరిగి ప్రారంభించారు.