గుక్కెడు నీటి కోసం పరుగులు

ABN , First Publish Date - 2020-07-09T12:08:12+05:30 IST

మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న చెర్లోపల్లె గ్రామంలో ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

గుక్కెడు నీటి కోసం పరుగులు

పెండ్లిమర్రి, జూలై 8: మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న చెర్లోపల్లె గ్రామంలో ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి తాగునీటిని అందించే బోరుబావి ఎండిపోవడంతో సంవత్సర కాలంగా గ్రామంలోని ప్రజలకు ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించేవారు. అయితే ప్రస్తుతం ఆ ట్యాంకర్ల ద్వారా సరఫరా అయ్యే నీటికి బిల్లులు మంజూరు కాకపోవడంతో వాటిని నిలిపివేశారు. దీంతో రెండు వారాలుగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. చేసేదేమీ లేక కి.మీ దూరంలో ఉన్న వ్యవసాయ బోరుబావుల వద్దకు వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు తక్షణం స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. 

Updated Date - 2020-07-09T12:08:12+05:30 IST