పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గిస్తాం : కేంద్ర మంత్రి

ABN , First Publish Date - 2021-03-07T17:02:57+05:30 IST

పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించేందుకు..

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గిస్తాం : కేంద్ర మంత్రి

చెన్నై/పెరంబూర్‌ : పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించేందుకు చర్యలు చేపడతామని, వీటిని జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై కూడా చర్చిస్తున్నట్టు కేంద్ర రహదారులశాఖ సహాయ మంత్రి వీకే సింగ్‌ తెలిపారు. మదురైలో రామ జన్మభూమి తీర్థక్షేత్రం ఆధ్వర్యంలో రామ రథయాత్రను ప్రారంభించిన మంత్రి మాట్లాడుతూ.. అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని దేశ ప్రజలందరూ స్వాగతిస్తున్నారని, పిల్లల నుంచి పెద్దల వరకు నిధులు అందజేస్తున్నారని తెలిపారు. అంతర్జాతీయంగా ముడిచమురుల ధరలను బట్టి పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో మార్పు చోటుచేసుకోవడం సహజమేనన్నారు. ప్రస్తుతం వీటి ధరల పెంపు ప్రజలను బాధించేలా వుందన్నారు తమిళనాడు అభివృద్ధికి పాటుపడేది తమ ప్రభుత్వమేనని, అందువల్ల అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే-బీజేపీ కూటమికి ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-03-07T17:02:57+05:30 IST