మార్చి నాటికి కడప ఎయిర్‌పోర్ట్‌ విస్తరణ పూర్తి : కేంద్ర మంత్రి

ABN , First Publish Date - 2020-09-21T20:44:50+05:30 IST

చ్చే ఏడాది మార్చి నాటికి కడప విమానాశ్రయం విస్తరణ పనులు పూర్తి కాగలవని

మార్చి నాటికి కడప ఎయిర్‌పోర్ట్‌ విస్తరణ పూర్తి : కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ : వచ్చే ఏడాది మార్చి నాటికి కడప విమానాశ్రయం విస్తరణ పనులు పూర్తి కాగలవని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి తెలిపారు. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ కడప ఎయిర్‌పోర్ట్‌లో ప్రస్తుతం ఉన్న రన్‌వే, టాక్సీ వే, ఆప్రాన్‌ వంటి విస్తరణ పనులు ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) పర్యవేక్షణలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 94 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 2017లో కడప ఎయిర్‌పోర్ట్‌ విస్తరణ పనులు ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. ఇప్పటి వరకు ఈ పనుల కోసం 49 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు.

Updated Date - 2020-09-21T20:44:50+05:30 IST