కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలి
ABN , First Publish Date - 2022-05-29T04:07:18+05:30 IST
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేపట్టిన పథకా లను, అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఖైర తాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ఇన్చార్జి పల్లె గంగారెడ్డిలు పేర్కొన్నారు. శనివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాధ్ ఆధ్వర్యంలో గద్దెరాగడిలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. నరేంద్ర మోదీ 8 ఏండ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమా లపై చర్చించారు. వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీలు విస్మరించిందని పేర్కొన్నారు.
మందమర్రిరూరల్, మే 28: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేపట్టిన పథకా లను, అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఖైర తాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ఇన్చార్జి పల్లె గంగారెడ్డిలు పేర్కొన్నారు. శనివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాధ్ ఆధ్వర్యంలో గద్దెరాగడిలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. నరేంద్ర మోదీ 8 ఏండ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమా లపై చర్చించారు. వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీలు విస్మరించిందని పేర్కొన్నారు. డబుల్బెడ్రూం ఇండ్లు, దళి తబంధు, నిరుపేదలకు భూ పంపిణీ, నిరుద్యోగ భృతి హామీలు ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు. హామీలు అమలు చేసేంత వరకు రాష్ట్ర ప్రభుత్వంపై పోరా టాలు చేస్తామన్నారు. నాయకులు రంగారావు, పురుషోత్తం, పోశం, అందుగుల శ్రీనివాస్, మునిమంద రమేష్, రజనీష్ జైన్, మల్యాల శ్రీనివాస్, బియ్యాల సతీష్రావు, శ్రీనివాస్, మాసు రజనీ, జోగుల శ్రీదేవి, వెంకటరమణరావు, పట్ట వెంకటకృష్ణ, కార్తీక్, నరేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.