రైతులను మోసం చేస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు

ABN , First Publish Date - 2022-05-25T05:57:24+05:30 IST

కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు మోసపూరిత ప్రకటనలతో రైతులను, ప్రజలను మోసం చేస్తున్నారని మంథని ఎమ్యెల్యే శ్రీధర్‌బాబు అన్నా రు.

రైతులను మోసం చేస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు
రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్యెల్యే శ్రీధర్‌బాబు

- మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

కమాన్‌పూర్‌, మే 24 : కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు మోసపూరిత ప్రకటనలతో రైతులను, ప్రజలను మోసం చేస్తున్నారని మంథని ఎమ్యెల్యే శ్రీధర్‌బాబు అన్నా రు. మండలంలోని రొంపికుంట గ్రామంలో మంగళవారం రచ్చబండ కార్యక్రమా న్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ పార్టీల ప్రజావ్యతిరేక విధానాలతో ప్రజలు నలిగిపోతున్నారన్నా రు. ఇటీవల వరంగల్‌లో రాహుల్‌ గాందీ నేతృత్వంలో జరిగిన రైతుబరోసా కార్యక్రమంలో ఇచ్చిన హామీలపై ప్రజలకు నమ్మకం కల్పించేందుకే గడపగడప కూ వరంగల్‌ డిక్లరేషన్‌ తీసుకెళుతూ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా మన్నారు. పార్టీ మండలాధ్యక్షుడు బుంపెల్లి రాజయ్య, బ్లాక్‌ కాంగ్రేస్‌ అధ్యక్షుడు తొట్లతిరుపతి యాదవ్‌, నాయకులు చొప్పరి సదానందం, గాండ్లమోహన్‌, సయ్య ద్‌ అన్వర్‌, సర్పంచ్‌లు కట్కం రవిందర్‌, ఆకుల ఓదెలు, గుమ్మడి శ్రీనివాస్‌, కోలనర్సాగౌడ్‌, కమ్మగోని మల్లయ్య, కుందారపు బాపు, కట్కం నారాయణ, సయ్య ద్‌ ఇక్బాల్‌, గుమ్మడి సతీష్‌, లల్లూ, పెండ్యాల రాజు, మల్యాల తిరుపతి తదిత రులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-25T05:57:24+05:30 IST