గతంలోనే ఆర్‌వోబీకి కేంద్రం నిధులు : గోడం నగేష్‌

ABN , First Publish Date - 2022-01-23T05:45:47+05:30 IST

తాను పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్నప్పుడే తాంసి బస్టాండ్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని మాజీ ఎంపీ గోడంనగేష్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

గతంలోనే ఆర్‌వోబీకి కేంద్రం నిధులు : గోడం నగేష్‌


ఆదిలాబాద్‌, జనవరి22 (ఆంధ్రజ్యోతి) : తాను పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్నప్పుడే తాంసి బస్టాండ్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని మాజీ ఎంపీ గోడంనగేష్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అప్పటి రైల్వే శాఖ మంత్రి సురేష్‌ప్రభు దృష్టికి తీసుకెళ్లగా 2016-17 కేంద్ర బడ్జెట్‌లో నిధులు మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇస్తూ జీవోను జారీ చేయడం సంతోషంగా ఉందన్నారు. తాను చొరవ తీసుకోవడం వలనే రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం పనులకు ముందడుగు పడిందన్నారు.

Updated Date - 2022-01-23T05:45:47+05:30 IST