వాయులింగేశ్వరుడి సేవలో ప్రముఖులు
ABN , First Publish Date - 2021-06-20T05:11:46+05:30 IST
శ్రీకాళహస్తిలో వెలసిన వాయులింగేశ్వరుడిని ప్రముఖులు వేర్వేరు సమయాల్లో దర్శించుకున్నారు.
శ్రీకాళహస్తి, జూన్ 19: శ్రీకాళహస్తిలో వెలసిన వాయులింగేశ్వరుడిని శనివారం తెలంగాణ రాష్ట్ర శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి, తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గోవిందరాజ్ వేర్వేరు సమయాల్లో దర్శించుకున్నారు. ప్రముఖులకు ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గురుదక్షిణామూర్తి సన్నిధి చేరుకోగా వేద పండితులు ఇచ్చి, తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఈవో పెద్దిరాజు, ఆలయ అధికారులు కృష్ణారెడ్డి, హరిబాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.