శ్రీవారి సేవలో ప్రముఖులు
ABN , First Publish Date - 2020-11-30T07:04:58+05:30 IST
శ్రీవేంకటేశ్వర స్వామిని ఆదివారం పలు వురు ప్రముఖులు దర్శించు కున్నారు.
తిరుమల, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): శ్రీవేంకటేశ్వర స్వామిని ఆదివారం పలు వురు ప్రముఖులు దర్శించు కున్నారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్ర కుమార్, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అశోక్, ఉపలోకాయుక్త జస్టిస్ బీఎస్ పాటిల్, ఏపీ జీఎస్టీ కమిషనర్ పీయూష్ కుమార్, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయాధికారులు దర్శన ఏర్పాట్లు చేసి, లడ్డూప్రసాదాలు అందజేశారు.