పీర్ల పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోండి
ABN , First Publish Date - 2022-08-10T04:35:28+05:30 IST
పీర్ల పండుగను ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కడప నియోజకవర్గ టీడీపీ ఇనచార్జ్ అమీర్బాబు పేర్కొన్నారు.
కడప(ఎర్రముక్కపల్లి), ఆగస్టు 9 : పీర్ల పండుగను ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కడప నియోజకవర్గ టీడీపీ ఇనచార్జ్ అమీర్బాబు పేర్కొన్నారు. మంగళవారం కడప నగరంలోని హోమియోపతి నగర్లో పీర్ల పండుగ ముగింపు కార్యక్రమంలో భాగంగా దర్గా కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు అమీర్బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీర్ల పండుగ అనేది కుల మతాలకు అతీతంగా జరుపుకోవాలన్నారు. ఈ పండుగను ఎక్కడైతే భక్తిశ్రద్ధలతో చేస్తారో అక్కడ ఆ దేవుని ఆశీస్సులు అందరి మీద ఉండి సుఖ సంతోషాలు, శాంతిసౌభాగ్యాలతో జీవిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ సభ్యులు మహబూబ్బాషా, సలీమ్, సత్తార్, తెలుగుదేశం పార్టీ నగర ప్రధాన కార్యదర్శి జలతోటి జయకుమార్, మైనార్టీ నాయకులు షేక్ ఇమ్రాన, సీఎ్స.నాసర్అలీ, భక్తులు పాల్గొన్నారు.